Sunday, April 28, 2024

తెలంగాణ‌లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ తేదీ ఖ‌రారు.. ప్ర‌క‌టించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు TSPSC వెల్లడించింది. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రకటనకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. 

గడువు ముగిసే నాటికి (జూన్‌ 4) మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement