Wednesday, May 15, 2024

Great Robbery – పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో రూ .19 కోట్ల లూఠీ…

ఇంఫాల్‌: మణిపుర్‌లో సినీ ఫక్కీలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఉఖ్రుల్‌ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ప్రభుత్వ బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేసి బ్యాంకులో రూ.18.80కోట్ల డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి అధునాతన ఆయుధాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోకి ప్రవేశించారు. ఆర్‌బీఐ, ఏటీఎంలకు పంపేందుకు నగదును ఇక్కడే నిల్వ చేస్తుంటారు.


ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్‌కు 80కి.మీల దూరంలో ఉంటుంది. దీనిపై కన్నేసిన దుండగులు సాయంత్రం బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు. వారందరినీ వాష్ రూమ్‌లోకి లాక్కెళ్లి బంధించారు. వీరిలో సీనియర్‌ ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఖజానాను బలవంతంగా తెరిపించారు. అందులో ఉన్న ఖజానాను దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకొనేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement