Sunday, May 19, 2024

‘మహా’ ఎన్‌కౌంట‌ర్ మృతుల గుర్తింపు

మహారాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లా ధ‌నోరా తాలుకాలోని గ్యార్‌ప‌ట్టి అడ‌వుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన కొందరు నక్సల్స్ ని పోలీసులు గుర్తించారు.కాగా మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్, డీవీసీఎం మహేష్ గోటా, డీవీసీఎం లోకేష్ మడకం, మిలింద్ వాడీగార్డులు కిషన్, భగత్ లు మృతిచెందిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఆరుగురు మహిళలు సహా 26మంది మావోయిస్టులు ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందారు.ఈ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన వివ‌రాల‌ను గ‌డ్చిరోలి ఎస్పీ ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు మీడియాకు వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement