Monday, May 6, 2024

Breaking : పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..మ‌హిళ మృతి..

తూర్పుగోదావరి : జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులో కరుణ్ కుమార్ హోటల్ సమీపంలో రోడ్డు సైడ్ పొలాల్లోకి దూసుకెళ్లింది ఓ కారు. కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ ఎస్ ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ సత్యనారాయణ కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా మల్లేపల్లి గ్రామం వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో తప్పించబోయి కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. కారు బోల్తా పడడంతో కారులో ఉన్న ఎస్సై భార్య కోడూరు సరోజ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement