Thursday, May 2, 2024

Gold seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.46.51 ల‌క్ష‌ల విలువైన బంగారం ప‌ట్టివేత‌..

దుబాయ్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌యాణికుడి వ‌ద్ద శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.46.51 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్ల‌వారు జామాను వ‌చ్చిన విమానంలో దుబాయ్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి బ్యాగ్ త‌నిఖీ చేయ‌గా అందులో భారీగా బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు గుర్తించారు. మొత్తం 828 గ్రాముల బంగారం పట్టుబడ‌గా.. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.46.51లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement