Thursday, May 16, 2024

ప్రధాని బర్త్‌డే బేబీలకు గోల్డ్‌ రింగ్‌.. తమిళనాడు బీజేపీ ఆఫర్‌

ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా ని ర్వహించాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ప్రధాని మోడీ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 17న, పుట్టిన బేబీలకు బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఫిషరీస్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రి ఎల్‌. మురగన్‌ గురువారం చెన్నయ్‌లో వెల్లడించారు. ఈ ఆఫర్‌ చెన్నయిలోని ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన వారికేనని మంత్రి ప్రకటించారు.

ఆ ఆస్పత్రిలో ప్రతిరోజూ 10 నుంచి 15 మంది శిశువులు జన్మిస్తున్నారని ఆయన వెల్లడించారు. బంగారు ఉంగరం సుమారు రెండు గ్రాములు ఉంటుందని, ఇది కేవలం ప్ర ధాని పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణుల ఆనందం కోసం ఇస్తున్న బహుమతి మాత్రమే అని మంత్రి ఎల్‌.మురగన్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement