Monday, April 29, 2024

ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో తెలంగాణ విద్యార్థికి గోల్డ్‌మెడల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్‌.. గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఢిల్లికి చెందిన ఆదిత్య, పుణకు చెందిన ధ్రువ్‌షాలకు స్వర్ణ పతకాలు దక్కితే, చండీఘడ్‌కు చెందిన రాఘవ్‌ గోయల్‌, చత్తీస్‌ఘడ్‌కు చెందిన రిథమ్‌ కేదియా రజత పతకాలు సాధించారు. భారత్‌ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా, అందరూ పతకాలు సాధించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement