Thursday, April 25, 2024

మర్డర్ మిస్టరీగా గీత సాక్షిగా.. ట్రైల‌ర్ రిలీజ్

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా తెర‌కెక్కుతోంది గీత సాక్షిగా మూవీ. ఈ చిత్రాన్ని ఆంథోని మట్టిపల్లి రూపొందిస్తున్నాడు. చేత‌న్ రాజ్ నిర్మించారు. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించేలా ఉంది. లేడీస్ హాస్టల్ లో జరిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో హీరో ఇరుక్కోవడం అత‌నికి శిక్ష విధించాలంటూ మ‌హిళా సంఘాలు పోరాటం చేసే స‌న్నివేశాల‌తో పాటు.. చేయ‌ని త‌ప్పుకు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న హీరో ఆద‌ర్శ్ తిర‌గ‌బ‌డే స‌న్నివేశాలు చూడొచ్చు. వెంక‌ట్ హ‌నుమ‌ నారిశెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి, కిషోర్ మ‌ద్దాలి ఎడిట‌ర్‌. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. పృథ్వీ ఫైట్స్ .. యశ్వంత్ – అనీష్ కొరియోగ్రఫీ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయట‌. ఈ చిత్రంలో ‘చ‌రిష్మా’ కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా క‌థాంశం తిరుగుతుంటుందని మేకర్స్ తెలియ‌జేశారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, అనితా చౌద‌రి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement