Friday, May 17, 2024

రాజ్యసభ ఎంపీగా నేడు గాయత్రి రవి ప్రమాణ స్వీకారం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఆరెస్ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) సోమవారం నాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం. గం. 10.05కు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, ఖమ్మం ఎంపీ, టీఆరెస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 400 మంది ఖమ్మం జిల్లా వాసులను గాయత్రి రవి విమానాల్లో ఢిల్లీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు గాయత్రి రవి కుటుంబానికి ఆతిథ్యమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement