Thursday, May 16, 2024

సంగం బ్యారేజీకి గౌతంరెడ్డి పేరు : సీఎం జగన్

సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… అన్ని సమస్యల్ని అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామన్నారు. వైఎస్ చొరవ వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైందన్నారు. 2008లో సంగం బ్యారేజీ పనులు మొదలయ్యాయన్నారు. వైఎస్ మరణం తర్వాత బ్యారేజీల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. రెండేళ్లలో రూ.300కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement