Monday, April 29, 2024

సర్వం ఈశ్వరేచ్ఛ!

శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు’ అంటారు పెద్దలు. అది అక్ష రాలా నిజం. మన ఇతిహాసాలు కూడా ఇవే చెబుతున్నాయి. పురాణ గాథల్లో జరిగే సంఘటనలన్నీ ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరిగాయని భావిం చారు పురాణ పురుషులు. రామాయణ గాథలో లంకలో జరిగిన సంఘటనల పట్ల ఆంజనేయస్వామి స్పందించిన తీరును తెలియజేసే ఈ కింది ఉదంతాల ద్వారా మనం ఈశ్వరేచ్ఛ అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమె ను చంపటానికి ముందుకు వెళతాడు. అప్పుడు హనుమంతుడు ‘ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి’ అనుకుంటా డు. కానీ మరుక్షణంలోనే హనుమంతుడు రావణుడి భార్య మండోదరి భర్త చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు. అది చూసి హనుమంతుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ‘నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని’ కదా అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, ‘నేను లేక పోతే ఎలా?’ అని. అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం… ఆ సమయంలో సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడుకి ”ఏ సమయంలో ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు” అని అర్థమైంది. హనుమంతుడు లంకలో మరింత ముందుకు వెళతాడు. అక్కడ విభీష ణుడి కుమార్తె త్రిజట ‘తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది.. దాన్ని నేను చూశాను.’ అని చెప్పడం వింటాడు ఆంజనేయస్వామి. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్ప లేదు కదా అనుకుంటాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి? ”ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది” అనుకు న్నాడు.
హనుమంతుని గుర్తించారు రాక్షసులు. ఆయన్ని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఎదురు తిరగలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి ‘అన్నా! దూతను చంపటం నీతి కాదు’ అంటాడు. అప్పుడు హనుమంతునికి ”తనను రక్షించే భారం ప్రభువు విభీషణునిపై ఉంచాడు” అని అర్థమయింది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విభీషణుడు ఆ మాట చెప్పి నప్పుడు రావణుడు వెంటనే అంగీకరించడం. ”కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్టండి” అని ఆజ్ఞాపి స్తాడు.
అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. ”లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! అనుకుంటాడు. ఇక్కడ గమనించాల్సింది… పరమాశ్చర్యకరమైన విషయం ఏంటంటే లంకాదహనానికి కావలసిన సన్నాహాలన్నిటినీ సిద్ధం చేసింది స్వయంగా రావణాసురుడే కదా అనుకున్నాడు హనుమంతుడు. ”పభువు లీలు ఎంత విచిత్రం…
రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!” అను కుంటాడు హనుమంతుడు. దీనినిబట్టి సర్వులు గుర్తుంచుకోవలసినది ప్రపంచంలో జరుగుతున్న దంతా ‘ఈశ్వరేచ్ఛ’ ప్రకారమే జరుగుతోంది అని. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకోవాలి.

  • కైలాస్‌ నాగేష్‌
    9849052956
Advertisement

తాజా వార్తలు

Advertisement