Friday, April 26, 2024

గద్వాల జిల్లాలో సూదిని మింగిన యువకుడు

గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు అనే యువ‌కుడు పశువులకు వాడే సూదిని నోట్లో పెట్టుకున్నాడు. దీంతో అది ఒక్కసారిగా గొంతులోకి చేరి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విపరీతమైన దగ్గుతో బాధ‌ప‌డ్డాడు.

అయితే అతడి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంట‌నే అత‌డిని కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు అత్యాధునిక టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా ఆ సూదిని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ప‌ద్ధ‌తి ద్వారా ఆ సూదిని తొల‌గించామ‌ని వైద్యులు చెప్పడంతో పరశురాముడు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: వైరల్: తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి

Advertisement

తాజా వార్తలు

Advertisement