Thursday, April 25, 2024

మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం

ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండ ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. కాలితో మహిళను కొట్టాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన బాధిత మహిళ.. ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించింది. అయితే, అప్పు తీర్చమని అడుగుతున్న పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగింది. ఈ క్రమంలో జనసంచారం లేని కృష్ణ కరకట్టపై మహిళపై దాడికి పాల్పడ్డాడు. కాలితో ఎగిరి తన్నటంతో మహిళ కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.

ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిషోర్ కొత్త స్ట్రాటజీ… 2024 ఎన్నికలకు సూపర్ స్కెచ్

Advertisement

తాజా వార్తలు

Advertisement