Friday, April 26, 2024

గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ.. 3 నెలలపాటు రూ.5వేల ఉపకారవేతనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 182 మంది గ్రూప్‌-1 మెయిన్‌కు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మెయిన్‌కు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈమేరకు ఆయన తెలిపారు. వరంగల్‌, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 మంది చొప్పున, హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో 200 మందికి మొత్తం 400 మందికి మెయిన్‌ పరీక్షకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.

బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది మెయిన్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా మెయిన్‌కు అర్హత సాధించిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవాలని, అయితే మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5వేలు చొప్పున 3 నెలలపాటు ఉపకార వేతనం అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement