Monday, March 25, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్‌లో రెండు రోజుల లాభాలకు గురువారం నాడు బ్రేక్‌ పడింది. సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు ఇలానే కొనసాగాయి. బడ్జెట్‌ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గురువారం నాడు వీక్లీ ఎక్స్‌పైరీ కూడా సూచీలపై ప్రభావం పడింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం కూడా సూచీలపై పడింది.


సెన్సెక్స్‌ 187.31 పాయింట్ల నష్టంతో 60858.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 57.50 పాయింట్ల నష్టంతో 19107.85 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 75 రూపాయలు పెరిగి 56361 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 421 రూపాయలు తగ్గి 67806 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.67 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, సిప్లా షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అపోలో ఆస్పటల్స్‌, అదానీ పోర్టులు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement