Sunday, April 28, 2024

తెలంగాణ విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఓ శుభవార్తను తెలిపింది. నీట్, ఎంసెట్, జేఈఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఉచితంగా షార్ట్‌ టైమ్‌ కోచింగ్‌‌ను ఆన్‌లైన్ ద్వారా అందించనున్నట్లు తెలిపింది. ఈ కోచింగ్‌‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత నెల 23న ప్రారంభించారు.

వివిధ సబ్జెక్టుల్లో పేరొందిన లెక్చరర్లతో ఈ ఆన్‌లైన్ శిక్షణను అందిస్తున్నట్లు మంత్రి సబిత వెల్లడించారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థులు కోచింగ్‌కు హాజరయ్యారు. ఈ 20 వేల మందిలో 2,685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు మంత్రి తెలిపారు. వారు చూపిన ప్రతిభ కారణంగా మరోమారు కోచింగ్‌ కొనసాగించినట్లు మంత్రి వివరించారు. విద్యార్థులు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ కోసం http://tscie.rankr.io లింక్‌ ద్వారా పొందాలని అధికారులు సూచించారు. కాగా విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వడానికి వివిధ ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థలు లక్షల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం అందించే ఈ ఉచిత కోచింగ్‌‌ను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement