Saturday, April 27, 2024

ముంబై ఇండియ‌న్స్ కు నాలుగో విజయం

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌ లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచింది. యూపీ వారియ‌ర్స్‌ పై 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(53) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును గెలిపించింది. నాట్ సీవ‌ర్ బ్రంట్ (45) ధాటిగా ఆడి ఆమెకు స‌హ‌కారం అందించింది. .మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ యూపీ వారియ‌ర్స్ 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు కొట్టింది. ఓపెనర్ అలిసా హేలీ (58), త‌హ్లియా మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీల‌తో చెల‌రేగారు. .ముంబై బౌల‌ర్ల‌లో సాయిక్‌ ఇషాక్ మూడు, హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు తీశారు. అమేలియా కేర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టింది

Advertisement

తాజా వార్తలు

Advertisement