Saturday, May 4, 2024

విష‌వాయువు పీల్చి.. న‌లుగురు కార్మికులు మృతి

సెప్టిక్ ట్యాంక్ లో పైపులు వేస్తూ విష‌వాయువు పీల్చి ఇద్ద‌రు వ‌ల‌స కూలీలు స‌హా న‌లుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బహదూర్ గఢ్ లో చోటు చేసుకుంది. జఖోడా గ్రామంలో మేస్త్రీ, కొందరు కూలీలు ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తాపీ మేస్త్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరో వ్యక్తి లోపలికి వెళ్లి పరిశీలించినా బయటకు రాలేదు. సహాయం చేయడానికి ప్రయత్నించిన యూపీకి చెందిన ఒకరు, మధ్యప్రదేశ్ కు చెందిన మరొకరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు అని బహదూర్గఢ్ లోని అసోడా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జస్వీర్ తెలిపారు. విషవాయువు పీల్చి ఊపిరాడక నలుగురూ మృతి చెందడం బాధాక‌ర‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement