Friday, May 3, 2024

జ‌మ్ము కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. న‌లుగురు ఉగ్ర‌వాదులు ఖ‌తం..

జ‌మ్మూ కశ్మీర్ లో భారత జవాన్లు మరోసారి ఉగ్రవాదుల పనిబట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడితో సహా నలుగురు ఉగ్రవాదులను ఖ‌తం చేశారు. చ‌నిపోయిన జైషే ఉగ్రవాదిని మజీద్ నాజిర్ గా బ‌ల‌గాలు గుర్తించాయి. ఈ మ‌ధ్య‌ ఫరూక్ మీర్ అనే పోలీసు అధికారిని చంపిన ఘటనకు అతనే బాధ్యుడని భావిస్తున్నారు. భారత భద్రతా బలగాలు ఇవాళ కశ్మీర్లో వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిపాయి. పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఈ టెర్రరిస్టులు హతమయ్యారు.

మూడ్రోజులుగా నిత్యం కశ్మీర్ లోయలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే భారత జవాన్లు 11 మంది ఉగ్రవాదలను అంతమొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement