Sunday, May 19, 2024

ఐపీఎల్‌ హక్కుల బరిలో నాలుగు కంపెనీలు..

ఐపీఎల్‌ మీడియా హక్కుల బిడ్‌లో నాలుగు దిగ్గజ సంస్థలు పాల్గొననున్నాయి. ఇందులో వయాకామ్‌ 18, డిస్నీ స్టార్‌, జీ, సోని పోటీపడే అవకాశం ఉంది. 2023 నుంచి 2027 వరకు మీడియా హక్కుల కోసం ఈ వేలం నిర్వహించనున్నారు. ఆదివారం ఈ వేలం జరగనుంది. ‘నాలుగు సంస్థలను ఎంపిక చేశాం. ఫైనల్‌ బిడ్లు దాఖలయ్యాయి. విజేత పేరును తర్వాత ప్రకటిస్తాం. ఇందులో వయాకాం 18, డిస్నీ స్టార్‌, సోనీ, జీ ఉన్నాయి” అని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

సీజన్‌కు 74 గేమ్‌ల చొప్పున ఐదేళ్ల కాలానికి కేటాయిస్తారు. చివరి రెండేళ్ల కాలంలో వీటి సంఖ్య 94 అయ్యే అవకాశం ఉంది. బిడ్ల ఎంపిక ప్రక్రియను నాలుగు దశలుగా విభజించారు. ఏబీసీడీలుగా విభజించారు. ప్యాకేజీ ఏ ప్రత్యేకంగా భారత ఉపఖండంలో టీవీల్లో ప్ర సారానికి సంబంధించినది. ఇక బీ అదే రీజియన్‌లో డిజిటల్‌ ప్రసారాలకు చెందినది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement