Tuesday, May 7, 2024

TS | బీజేపీలో చేరిన నలుగురు బీఆర్ఎస్‌ నేతలు..

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు ఇవ్వాల బీజేపీలో చేరారు. సీతారాం నాయక్, జలగం వెంకట్ రావు, సైదిరెడ్డి, గోడం నగేశ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి. అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement