Friday, May 3, 2024

కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్

5 రాష్ట్రాల ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కొందరు సీనియర్ నాయకులు వీడారు. తాజాగా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్ ఆపార్టీకి గుడ్ చై చెప్పేశారు. ఆయన బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ ప్రహ్లాద్ జోషితో సహా ప్రముఖుల సమక్షంలో కషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే బీజేపీలో చేరినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. 2002, 2007 ఉత్తరాఖండ్ ఎన్నికలలో కిశోర్ తెహ్రీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన ఆదే ప్రాంతం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కిశోర్ ఉపాధ్యాయ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన నేపథ్యంలో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్యల కింద అన్ని పదవుల నుంచి గతంలోనే ఆయనను తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement