Thursday, May 2, 2024

TTD నిధులతో తెలంగాణ ఆలయాలకు పూర్వ వైభవం : టీటీడీ చైర్మెన్ సుబ్బారెడ్డి

సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల, మండలాలలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు, వేణు గోపాల స్వామి ఆలయాలకు టీటీడీ ద్వారా కోట్లాది నిధులను మంజూరు చేస్తూ ఆలయాలను పున‌ర్నిర్మాణం చేప‌డుతు పూర్వ వైభవం తీసుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాలు చేప‌ట్టుటకు కోట్లాది నిధులు విడుదల చేసినట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసే ఉంటున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లుటకు ఇద్దరు సీఎంలు చేస్తున్న కృషి గొప్పదని టిటిడి చైర్మెన్ కొనియాడారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను తారక్ గా పేర్కొంటూ గొప్ప నాయకుడు తారక్ అని ఆయన టిటీడి ద్వారా ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు అడిగినా ఇవ్వడానికి సిద్దం అని హామీ ఇచ్చారు. ప్రజల గుండెల్లో ఉండేలా పని చేస్తున్న మంత్రి, సీఎంలు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే పనులు చేస్తున్నట్లు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement