Thursday, May 9, 2024

ప్రజారోగ్య పరిరక్షణ కోసం.. చెట్ల పెంపకం ఎంతో అవసరం: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చెట్టు – బొట్టుగా పేరు పెట్టారు. 

తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనదనీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదు. వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరం అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిచాలి. ఊపిరి తిత్తుల కాపాడాలి. చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృధి జరుగుతుందనీ  మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచ్ఛ గోదావరి తాగు నీరు అందిస్తున్నామనీ అన్నారు.. 

ఆహారం, వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో పండించిన పంట అందింస్తున్నామని అన్నారు.హరిత హారంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టాం.

మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త వేరడం ఒక మంచి పరిణామనీ అన్నారు. కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలుగుతుంది. మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారు. జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్బ్యాక్ లో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement