Monday, April 29, 2024

Express Highway ల‌పై పొగ‌మంచు విధ్వంసం… పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు ఢీ… ముగ్గురి మృతి

ల‌క్నో – రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, తాజ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్‌ప్రెస్‌వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 15 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. ఉన్నావ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుకు వెళుతున్న కంటైనర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. అలాంటి పరిస్థితిలో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. ఇంతలో మరో నాలుగు వాహనాలు కూడా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంగార్మావు సీహెచ్‌సీలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement