Saturday, April 27, 2024

తప్పిన ముప్పు..ల్యాండింగ్ సమయంలో పేలిన విమానం టైర్..

కర్ణాటకలోని హుబ్లిలో ఓ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. విమానం టైర్ బరస్ట్ అయిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో వారందరూ సేఫ్‌గా ల్యాండయ్యారు. రన్ వే కొద్దిగా దెబ్బతిన్నట్లు సమాచారం. కన్నూర్ నుంచి హుబ్లి వచ్చిందా ఇండిగో కంపెనీ విమానం. రాత్రి 8.30 గంటలకు ల్యాండవ్వాల్సింది. కానీ వ్యతిరేక దిశలో భయంకరంగా గాలులు వీస్తుండటంతో విమానం ల్యాండవ్వలేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత 8.35కు విమానం ల్యాండ్ చేయాలని పైలట్ భావించాడు. అలా చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఎదురు గాలిలో ల్యాండయ్యే సమయంలో తలెత్తిన సమస్యల వల్లే విమానం టైర్ బరస్ట్ అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానం మెయింటెనెన్స్ జరుగుతోందని, విమాన సిబ్బంది, ప్యాసింజర్స్ అందరూ క్షేమంగానే ఉన్నారని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement