Tuesday, April 30, 2024

FLASH : డిసీఎం వ్యాన్ – కారు ఢీ.. పలువురికి గాయాలు

గణపురం, (ప్రభన్యూస్) : జయశంకర్​భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారిపై గణపురం మండలం కర్కపల్లి వే బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదుగా వస్తున్న కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. చెల్పూరుకు చెందిన రాఘవరావు అనే వ్యక్తి కారులో చెల్పూర్ కు వెళ్తుండగా, పెళ్లి బృందంతో భూపాలపల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాఘవరావుకు తీవ్ర గాయాలు కాగా 108లో హాస్పిటల్​కు తరలించారు. అలాగే ఈ ఘటనలో పెళ్లి బృందంలోని కొంత మందికి స్పల్పంగా గాయాలయినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement