Monday, April 29, 2024

National : వ‌స్త్ర‌దుకాణంలో అగ్నిప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి..

మహారాష్ట్రలో ఇవాళ ఉద‌యం ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్టు సమాచారం. మిగతావారి ఆచూకీ లభించాల్సి ఉంది. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంటోన్మెంట్​ ప్రాంతంలోని జైన దేవాలయం సమీపంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement