Sunday, April 28, 2024

National : ఢిల్లీలో ఓ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం … నలుగురు మృతి

ఢిల్లీలో ఓ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. శాస్త్రి నగర్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ఐదుగురిని రక్షించారు.

మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), 3, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (షహదర) సురేంద్ర చౌదరి మాట్లాడుతూ.. గురువారం ఉదయం 5:22 గంటలకు శాస్త్రి నగర్ ప్రాంతంలోని సరోజినీ పార్క్ సమీపంలోని గాలి నెం.13 వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు కాల్ అందిందని తెలిపారు.

- Advertisement -

దీంతో స్థానిక పోలీసులు నాలుగు ఫైర్‌ టెండర్లు, అంబులెన్స్‌లు, మూడు పీసీఆర్‌ వ్యాన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ‘ఇది నాలుగు అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ ఉన్న నివాస గృహం. పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో భవనం మొత్తం పొగతో నిండిపోయింది. ఇరుకైన వీధి ఉన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు’ అని డిసిపి చెప్పారు. ‘ప్రతి అంతస్తులో శోధన జరిగింది. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను రక్షించి హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారు, ‘అని అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement