Sunday, April 28, 2024

AP | రెండు రోజుల్లో టీడీపీ ఫైనల్ జాబితా..

మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో భాగంగా ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి.

పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు రెండు జాబితాల్లో కలిపి 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక మ‌రో రెండు రోజుల్లో మిగిలిన 16 ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

కాగా, జనసేన పార్టీ రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 6 పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement