Monday, April 29, 2024

రేణిగుంట విమానాశ్రయంలో సినీ నటుడు బాలకృష్ణకు ఘన స్వాగతం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తెలుగు యువత నాయకులు రూపేంద్ర వర్మ ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు నారవారిపల్లెలో జరుపుకుంటారు. దానికి తోడు విడుదలైన వీర సింహారెడ్డి సినిమాతో పెద్ద ఎత్తున అభిమానులు ఆనందోత్సవాల మధ్య జై బాల‌య్య‌… జై జై బాలయ్య అంటూ రేణిగుంట విమానాశ్రయం దద్దరిల్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement