Wednesday, May 15, 2024

టెట్‌కు ములుగు జిల్లా నుంచి తక్కువ దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మంగళ వారంతో గడువు ముగిసింది. మొత్తం 6,26,928 దరఖాస్తులు వచ్చినట్లు టెట్‌ కన్వీనర్‌ ఎం.రాధారెడ్డి ప్రకటించారు. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య మాత్రం 3,79,101 మంది ఉన్నారు. వీరిలో రెండేసీ పేపర్లు రాసేవారూ ఉండడంతో అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.

ములుగు జిల్లా నుంచి టెట్‌ పరీక్ష రాయబోయే అభ్యర్థు కేవలం 1,920 మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి 30వేల మంది ఉన్నారు. మంగళవారం దరఖాస్తుకు చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు 5929 మంది రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement