Friday, May 3, 2024

ఆల్‌ ఇండియా కైట్‌బోర్డింగ్‌ చాంపియన్స్‌గా ఫెర్నాండెజ్‌, కట్యా సైనీ

3వ ఆల్‌ ఇండియా కైట్‌బోర్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో మెన్స్‌ విభాగంలో ఫెర్నాండెజ్‌, ఉమెన్స్‌ విభాగంలో కాత్యా సైనీ చాంపియన్స్‌గా నిలిచారు. గురువారంనాడిక్కడ జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జున్‌, జెహన్‌ హోసిలతో ఫెర్నాండెజ్‌ తలపడ్డాడు. ఫెర్నాండెజ్‌ నెట్‌ స్కోర్‌ 10.00 కాగా, అర్జున్‌, జెహాన్‌ 19.00, 22.00లతో 2, 3 స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో కాత్యా సైనీ 8.0తో ఉమెన్స్‌ నేషనల్‌ చాంపియన్‌ చేజిక్కించుకుంది.

కియోనా రజనీ 14.00, అవిష్మా మట్టా 30.00తో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు యాచ్‌టింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రటరీ జితేంద్ర దీక్షిత్‌, తమిళనాడు సైలింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ టక్కర్‌, చెన్నై సెయిలింగ్‌ అకాడమీ అధ్యక్షుడు అజిత్‌ డియాజ్‌ ట్రోపీలు అందజేసి, ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement