Sunday, April 28, 2024

కరోనా వచ్చిందన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా వచ్చిందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా జ్వరం ఇతర లక్షణాలతో రాపర్ల హరిబాబు బాధపడుతున్నాడు. కరోనా వచ్చిందంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో భయపడి.. వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకోకుండానే గ్రామ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement