Thursday, April 25, 2024

మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే

ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన కేరళ అసెంబ్లీలో తొలిసారి ఓ ఆసక్తిర దృశ్యం కనిపించనుంది. త్వరలో మామ, అల్లుడు కలిసి ఒకేసారి శాసనసభలో అడుగుపెట్ట‌బోతున్నారు. ఇంత‌కూ ఎవ‌రా మ‌మా అల్లుళ్లు అనుకుంటున్నారా..? వాళ్లే కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఆయ‌న అల్లుడు మ‌హ్మ‌ద్ రియాజ్‌. కొత్త‌గా కొలువుదీరబోయే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మామ‌, ఎమ్మెల్యేగా అల్లుడు ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నారు.

కొత్త‌గా ఎమ్మెల్యేగా గెలిచిన మ‌హ్మ‌ద్ రియాజ్ పిన‌ర‌యి విజయన్ కుమార్తె వీణ భర్త. వీణ ప్రస్తుతం బెంగళూరులో ఓ ఐటీ సంస్థను నడుపుతున్నారు. విజ‌య‌న్ తాజా ఎన్నిక‌ల్లో కాన్నూర్ జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ధర్మదాం నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. ఆయ‌న అల్లుడు రియాజ్‌ కోజికోడ్‌లోని వామపక్షాల కంచుకోట బేపోర్ నుంచి గెలుపొందారు. గత డాది జూన్ 17న ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో వీణ, రియాజ్‌ వివాహం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement