Monday, April 29, 2024

వరదల్లో పంట నష్టం.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య..

ఉట్నూర్ (ప్రభన్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చాందూరి గ్రామానికి చెందిన రైతు పుర్భవర్ విట్టల్ (24) ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై భరత్ సుమన్ తెలిపారు. సాగు చేస్తున్న పంటలు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి నష్టం జరిగిందని, లక్ష రూపాయల వరకు న‌ష్టం కాగా, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఎస్ఐ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement