Monday, April 29, 2024

Fallow up – పట్టాలు తప్పిన నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ – నలుగురు మృతి.. 70 మంది కి పైగా గాయాలు

బక్సర్‌: బీహార్‌లోని బక్సర్‌ జిల్లా రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్‌ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తున్న నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి . ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.

దీంతో స్థానికులతోపాటు రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను బ్రహ్మపుర్‌ దవాఖానకు తరలించారు. ప్రమాదం నేపథ్యంలో 21 రైళ్లను అధికారులు దారిమళ్లించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement