Wednesday, May 1, 2024

HYD: నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ లో కాల్ సెంటర్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న మహ్మద్ సలీం, మహ్మద్ ఆరిఫ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ యాడ్స్ లో బ్రాండ్ కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్ల స్థానంలో వీళ్ల నెంబర్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీసీఎస్ జాయింట్ సీపీ తెలిపారు. టెక్నీషియన్లను నియమించుకుని రిపేర్ల పేరుతో మోసగిస్తున్నారని జాయింట్ సీపీ వెల్లడించారు. శాంసంగ్, ఎల్జీ, గోద్రెజ్ పేరుతో హైదరాబాద్, ముంబై, నోయిడా, బెంగళూర్ తో పాటు విశాఖలో నకిలీ కాల్ సెంటర్లు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement