వెంకటేశ్ – వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపుడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్ 3’ మే నెల 27వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.
అయితే ఈ మద్య కాలంలో ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదైలన రెండు మూడు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తుంది.. అలాగే ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో రానుందని ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి ప్రచారం జరిగితే .. ‘ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో ఓటీటీకి వస్తుంది కదా’ అని జనాలు థియేటర్లకు వెళ్లడం మానేస్తారు. అందువలన ఈ సినిమా టీమ్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. దీంతో అనిల్ రావిపూడి.. వెంకటేశ్.. వరుణ్ తేజ్ లు దీనికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అన్నీ సినిమాల్లాగా ఈ సినిమా 4 వారాల్లో ఓటీటీకి రాదనీ.. 8 వారాల తరువాతనే వస్తుందని గట్టి క్లారిటీ ఇచ్చారు. అప్పటి వరుకు సినిమా చూడని వాల్లు టైం వేస్ట్ చేయకుండా త్వరగా థియేటర్స్ కి వెల్లి ఈ సినిమా చూసేయండి అంటూ కాస్త కామెడీ టచ్ ఇస్తూనే, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదని తేల్చేశారన్న మాట.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..