Thursday, May 9, 2024

‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరం 44వ డివిజన్ భక్త రామదాస్ కళాక్షేత్రం నందు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుందని, అంధత్వంలేని తెలంగాణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, అన్నారు. కేంద్రాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ పరిక్షల నిర్వహణ అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి – సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన చేసుకోగలుగుతామని, గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు వెళ్ళాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమమని ప్రజలు మరింతగా సద్వినియోగించుకోవలని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, ఏ ఇతర పథకాలు చేపట్టినా వంద శాతం అమలు చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇంత గొప్ప పథకాలని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని మీ అందరిని కోరుతున్నానన్నారు. ప్రజా ప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకి అవగాహన కల్పించి అధికారులని సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ శ్వేత, సుడా ఛైర్మన్ విజయ్, కార్పొరేటర్ విజయ, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement