Thursday, May 2, 2024

వివాహేత‌ర సంబంధం-వ్య‌క్తిని ముక్క‌లు చేసి ప‌డేసిన నిందితులు

ప్ర‌భు అనే వ్య‌క్తికి పెళ్ల‌యింది. కాగా బ్యూటీ ప్లార‌ర్ న‌డిపే ఓ మ‌హిళ‌తో ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉండేది. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. తెలిసిన ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఆ మహిళ.. ప్రభును దారుణంగా హత్య చేసింది. శరీరాన్ని ముక్కలు చేసి, నగరంలో అక్కడక్కడ పడేసింది. ఇప్పటివరకు 8 శరీర భాగాలు లభ్యమయ్యాయని, ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. త‌మిళ‌నాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చంపి 12 ముక్కులు చేసి వేర్వేరు చోట పడేశారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. మృతుడికి మహిళకు గతంలో వివాహేతర సంబంధం ఉండేదని తర్వాత అది శత్రుత్వంగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు కారణం అదేనని పోలీసులు వెల్లడించారు. గత గురువారం తుడియాలూర్ సమీపంలోని వెళ్లకినార్​లోని ఓ చెత్త కుండీ వద్ద ఒక చెయ్యి కనిపించింది. పోలీసులు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో.. ప్రభు(39) అనే వ్యక్తి కనిపించడం లేదన్న కేసు నమోదైంది. రెండింటినీ కలిపి చూడగా.. అసలు విషయం బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement