Monday, April 29, 2024

IBS ర్యాగింగ్ కేసులో విచారణ వేగవంతం

హైదరాబాద్ లోని IBS ర్యాగింగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం. ఈ క్రమంలో జూనియర్ పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement