Thursday, May 9, 2024

విద్యార్థుల‌తో క‌లిసి వ్యాయామం చేసిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు..

కృష్ణాజిల్లా: పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు మార్నింగ్ వాక్ చేశారు. అనంత‌రం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి వ్యాయామం చేశారు. ఏపీలో వెంక‌య్య‌నాయుడు నాలుగు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ‘ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం’ అనేది నినాదంగా కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులకు పుస్తక పఠనాన్ని ఆటపాటల్లా అలవాటు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement