Thursday, May 2, 2024

ఎల‌క్ట్రిక‌ల్ బైక్ లో మంట‌లు : త‌ప్పిన ముప్పు


ఎల‌క్ట్రిక‌ల్ బైక్ లో ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు చెల‌రేగాయి. దాంతో స్థానికులు గ‌మ‌నించి బైక్ పై వున్న వ్య‌క్తిని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం గుర‌వాయి గూడెంలో చోటు చేసుకుంది. క‌రెంట్ ఛార్జింగ్ తో న‌డిచే బ్యాట‌రీ బైక్ లో మంట‌లు చెల‌రేగి బైక్ ద‌గ్థ‌మ‌యింది. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు నారాయణ మూర్తి తన బ్యాటరీ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బైక్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు నారాయణమూర్తిని బైక్ ఆపి రావాలంటూ అప్రమత్తం చేశారు. బ్యాగ్ మరచిపోయానని చెప్పి.. బైక్ దగ్గరకి వెళ్లి ఒక్క అడుగు ముందుకు వేసిన తర్వాత బైక్ నుంచి మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది. నారాయ‌ణ‌మూర్తి ప్రాణాపాయం నుండి త‌ప్పించుకున్నాడు .

Advertisement

తాజా వార్తలు

Advertisement