Wednesday, May 22, 2024

KNR: ఎన్నిక‌ల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి… కేటీఆర్

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ భేటీ అయ్యారు.

సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం అయ్యేందుకు కరీంనగర్ కు వచ్చిన ఆయన తొలుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, బీఆర్ఎస్ జిల్లా, నగర అధ్యక్షులు జీవీ రామకృష్ణ, చల్ల హరిశంకర్ లతో కలసి సమావేశమ‌య్యారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాల‌న్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై కన్నువేసి ప్రజల పక్షాన పోరాడాలని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement