Monday, May 6, 2024

Death Anniversary – వెంక‌టాపురంలో ఘనంగా పరిటాల వర్ధంతి వేడుక‌లు ..

శ్రీ సత్య సాయి బ్యూరో జనవరి 24 (ప్రభన్యూస్): దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి బుధవారం ఆయన స్వగ్రామం వెంకటాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పరిటాల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వెంకటాపురం జనసంద్రంగా మారింది.మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం పరిటాల శ్రీరామ్ తదితరులు పరిటాల రవీంద్ర ఘాటు వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర ఒక మనిషిగా కాక ఒక శక్తిగా వెలిగిన మహా నాయకుడు అన్నారు. ఆయన మృతి చెంది 19 ఏళ్లు గడిచిన ఇప్పటికీ ఆయన పై అభిమానం ప్రజల నుంచి వ్యక్తం కావడం గర్వకారణం అన్నారు. వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా రక్త దానాలు, అన్నదానాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement