Tuesday, May 21, 2024

Election Promise – మ‌హిళ‌ల‌కు అంద‌రికి ఆర్టీసీ బ‌స్సుల‌లో ఉచిత ప్ర‌యాణం – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ – కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆర్టీసీ బస్సుల‌లో ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు… హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఎంపీ కార్యాలయంలో కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో ఆదిలాబాద్, షాద్‌నగర్, ఉప్పల్‌ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు 5లక్షల సాయంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు 2లక్షల రుణమాఫీ, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు.

అదిలాబాద్ రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ, జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదన్నారు. జోగు రామన్న చెల్లని రూపాయని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న రేవంత్‌… అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నఆయ‌న‌ ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement