Monday, April 29, 2024

గ్రూప్‌-1 దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌.. తప్పులను సరిచేసుకునేందుకు చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరి చేసుకునేందుకు అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈనెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎడిట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, ఫోటో, అర్హతలు తదితర సవరణలకు అవకాశమిచ్చినట్లు తెలిపింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల దరఖాస్తులను కమిషన్‌ స్వీకరించింది. అయితే ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను అక్టోబర్‌ 16న, మెయిన్స్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement