Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ క‌విత పీఏ ఇంట్లో ఈడీ సోదాలు..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ సోదాలకు దిగింది. హైదరాబాద్ లో ఆరు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాబిన్ డిసిలర్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై, కంపెనీ తో పాటు ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పిళ్లై సహా మరో ఐదుగురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలకు వెళ్లారు ఈడీ అధికారులు. ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement