Sunday, April 28, 2024

National : ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు..

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. గెహ్లాట్కు ఈడీ విచారణకు రావాలని పిలిచింది. అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అలాగే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద వాంగ్మూలాన్ని తీసుకోవాలని కైలాష్ గెహ్లాట్‌ను కోరినట్లు ఈడీ చెప్పుకొచ్చింది. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలపై విచారించేందుకు రావాల్సిందిగా ఈడీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement